![]()
భారత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నేతల నివాళి
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే 21
టేకులపల్లి మండల కేంద్రంలోని బోడు రోడ్ సెంటర్లో బుధవారం మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా వారు భారతదేశ నిర్మాణంలో వారు చేసిన సేవలను స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్, మోకాళ్ళ పోషాల్, సర్దార్, వెంకన్న, ఇస్లావత్ రెడ్యా నాయక్, సేవియా, గుడిపూడి కృష్ణార్జునరావు, ఈది గణేష్, బానోతు రవి, పుణ్య నాయక్, రమేష్, బాబురావు, వీరభద్రం, సంజీవ నాయక్ రసమళ్ళ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.


