Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemమండలంలో కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బందులు

మండలంలో కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బందులు

Loading

  • చిన్న చినుకు పడితే చాలు వెంటనే కరెంట్ కట్
  • రోజులో కనీసం 5, 6 సార్లు కరెంటు కట్ చేస్తున్నారని మహిళలు ఆవేదన

చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, జూలై 03

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలంలో ప్రజలు కరెంటు కోతలు వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు కష్టాలు వస్తాయన్న గత ప్రభుత్వం మాటలను ఈరోజు మండలంలోని విద్యుత్ అధికారులు మాత్రం నిజం చేస్తూ కరెంటుని రోజుకి నాలుగు, ఐదు సార్లు కట్ చేస్తున్నారు. చిన్న చినుకు పడితే చాలు కరెంట్ కట్ అనే భావనను ప్రజల్లోకి తీసుకువచ్చే విధంగా చేస్తున్నారు. రాత్రివేళలో మాత్రం చినుకు పడిందంటే కరెంటు రాదు అన్న విషయాన్ని ప్రజలకు నేర్పిస్తున్నారు. ఉదయం పనికి వెళ్లి మహిళలు సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వస్తే, ప్రతి పది నిమిషాలకు ఒకసారి కరెంటు పోవడం వల్ల అప్పటివరకు వ్యవసాయం పనిలో కష్టపడి ఇంటికి వచ్చి త్వరగా పని ముగించుకుందాం అనుకుంటే, కరెంటు వల్ల పని ఆలస్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా కరెంటు కోతల వల్ల మండలంలోని ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఇకనైనా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించి కరెంటు కోతలు లేకుండా, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాలని కోరుతున్నారు.

కరెంటు కోతలపై విద్యుత్ శాఖ ఏఈ వివరణ

ఈ విషయంపై విద్యుత్ అధికారిని (ఏఈ) వివరణ కోరగా ఎండాకాలంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా రైతులకు ఇచ్చే విద్యుత్ ని నిలిపివేశాము. ఇప్పుడు రైతులకు విద్యుత్ అవసరం కనుక వాటిని మరమ్మత్తులు చేస్తున్నాము. ఒరిగిన స్తంభాలను కూడా మరమ్మత్తులు చేస్తున్నాము. రెండు, మూడు రోజుల్లో 24 గంటలు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page