![]()
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, మే 17
మండలంలోని అయ్యన్నపాలెం గ్రామంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వారాది సత్యనారాయణ ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అశ్వారావుపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి కట్రం స్వామి దొర పాల్గొని మాట్లాడుతూ మండలంలో స్థానిక సంస్థల్లో అధిక గ్రామపంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ పోటీ చేయాలని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల కొరకు పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వారాధి సత్యనారాయణ, చాపలమడుగు వెంకటేశ్వర్లు, సిహెచ్ కిరణ్, వెంకటి, కృష్ణార్జునురావ్, కోటేశ్వరరావు, కుంజ పరమేశ్వరరావు, కోడుమూరు సత్యనారాయణ, కిలారి ప్రసాద్, బద్దం వెంకటి, పూకా మోహన్ రావు, కుంజ మోహన్ రావు, శేఖర్, నేక్కడ రామారావు, ఆకుల సత్యనారాయణ, వేతి సోమయ్య, సున్నం శోభన్, ఇస్లావత్ కిషన్, మదర్ షాప్, లాల్ అహ్మద్, గోసుల వెంకటేశ్వర్లు, జంగా శ్రీనివాస్ రెడ్డి, సిద్ధిని సీతారాములు, పొడిచేటి వెంకటాచారి, ఎస్కే బాబు, జహీర్, ఆలీ, తదితరులు పాల్గొన్నారు.


