![]()
👉మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం-అశ్వరావుపేట నియోజకవర్గ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఫజల్ బక్షి
👉చండ్రుగొండ,మన భద్రాద్రి, జూన్ 03
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలోని అశ్వరావుపేట నియోజకవర్గం సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఫజల్ బక్షి మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానం మేరకు అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హైదరాబాద్ గాంధీ భవన్ లో వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ విషయం తెలియక మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అని అనడం చాలా హాస్యస్పదమైందని,
దీని తీవ్రంగా ఖండిస్తున్నామని, గెలిచిన ఐదు సంవత్సరాల లో కనీసం మండలానికి ఎన్నిసార్లు వచ్చాడో చెప్పమని ఆయనకే వదిలేస్తున్నాం. గెలిచిన 5 నెలలోనే మండలానికి లెక్కపెట్టలేనన్నిసార్లు వచ్చిన ఎమ్మెల్యేని పట్టుకొని ఎమ్మెల్యే ఉన్నాడా అనడం కరెక్ట్ కాదని వాక్యాలను వెనక్కి తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షులు బొర్రా సురేష్ పాల్గొన్నారు.


