![]()
-డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్, మన భద్రాద్రి న్యూస్, మార్చి 09
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా దూసుకెలుతుంది.మార్చి 12 నుండి రాష్ట్రంలోని మహిళలకు ఇందిరా క్రాంతి పథకం క్రింద వడ్డీలేని రుణాలను ప్రారంభిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.దీని ద్వారా సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోడానికి మహిళా సంఘాలకు అవకాశం లభిస్తుందని అన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు.రాష్ట్రంలోని ప్రతీ మహిళను మహాలక్ష్మిగా భావించి గౌరవిస్తున్నామని ఈ సందర్భంగా అన్నారు.


