![]()
మిషన్ భగీరథ నీరు రాక గ్రామస్తులు ఆందోళన
- నీరు వృధాగా పోతున్న పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి
- టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్
- టేకులపల్లి, గోల్య తండా పంచాయతీలో గత కొన్ని 20 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. నీటి విషయమై పలుమార్లు పంచాయతీ కార్యదర్శి కి చెప్పినా పట్టించుకోలేదు. మిషన్ భగీరథ ట్యాంకు వద్ద అవుట్ పగిలిపోయి చాలా రోజుల నుండి నీరు వృధాగా పోతున్న అధికారులు ఎవరూ స్పందించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వచ్చే కొద్ది మాత్రము త్రాగునీటి కోసం గ్రామస్తులు మోటారు పెట్టి నీరుని తోడుతున్నారు. తాగునీటి సమస్యను అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. దీని విషయమై న్యూ స్టూడియో పంచాయతీ కార్యదర్శికి కాల్ చేయగా అందుబాటులోకి రాలేదు.


