![]()
మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, మే 17
మండలంలోని ఘనబోయిన గుంపు గ్రామానికి చెందిన మట్ట వెంకటేశ్వర్లు కుమారుడు ఇంకుడు గుంటలో పడి మరణించగా, విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు శుక్రవారం రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా రూ. 50 వేల చెక్కును బాధితులకు అందించారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల బీఆర్ఎస్ అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, బీఆర్ఎస్ మండల కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


