![]()
-భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం
-మణుగూరులో ప్రజా దీవెన బహిరంగ సభలో ప్రసంగం
-ముఖ్యమంత్రిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలి పర్యటన
కొత్తగూడెం, మన భద్రాద్రి న్యూస్, మార్చి 10
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పర్యటనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముస్తాబవుతుంది.రేపు ఉదయం 11 గంటలకు సీఎం హైదరాబాద్ నుండి హెలికాప్టరులో భద్రాచలం బయలుదేరనున్నారు.మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకోనున్నారు.అనంతరం మార్కెట్ యార్డు స్థలంలో ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించనున్నారు.సాయంత్రం 4 గంటలకు మణుగూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జరగబోయే ప్రజా దీవెన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.


