![]()
మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, జూలై 29
మండలంలోని దివ్యాంగులకు మంగళవారం సురక్ష బస్టాండ్ నందు ఉదయం 10 గంటలకు బస్సు పాస్ మేళ నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ కుదిరుపాక శ్యామ్ సుందర్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రాయితీ బస్సు పాసుతో డీలక్స్, ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు బస్సులలో 50% రాయితీతో తెలంగాణ రాష్ట్రమంతా ప్రయాణించవచ్చని, ఈ రాయితీ బస్సు పాసు కావాల్సిన వారు సదరం సర్టిఫికెట్ జీరాక్స్, ఆధార్ కార్డు జీరాక్స్, ఒక పాస్ ఫోటో మరియు 50 రూపాయలు తీసుకొని రాగలరని కోరారు. పూర్తి వివరాలకు 7382859142, 7659823007 నెంబర్లను సంప్రదించాలని ఆయన తెలిపారు.


