![]()
హైదరాబాద్, మన భద్రాద్రి న్యూస్, మార్చి 10
రైతుబంధు (రైతు భరోసా) డబ్బుల జమపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు మూడు ఎకరాలు వున్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తించిందని, ప్రస్తుతం నాలుగెకరాలు ఉన్న రైతులకు అందిస్తున్నామని, త్వరలో ఐదు ఎకరాలు ఉన్న అన్నదాతలకు కూడా నగదు జమ చేస్తామని తెలిపారు.గత ప్రభుత్వం కొండలు, గుట్టలు ఉన్న బడాబాబులకు కూడా రైతుబంధు ఇచ్చి 20 వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.


