![]()
ఆళ్లపల్లి, మన భద్రాద్రి బ్యూరో, ఏప్రిల్ 03
మండల పరిధిలోని జిన్నలగూడెం గ్రామంలో శ్రీ రామ సీడ్స్ వారి ఆధ్వర్యంలో రైతు ప్రదర్శన క్షేత్రం నిర్వహించారు. ఈ క్షేత్రంలో ఏరియా సేల్స్ మేనేజర్ ఎం వెంకన్న మాట్లాడుతూ శ్రీరామ సీడ్స్ వెరైటీ అయిన ఎస్ఆర్ఎంచ్ – 609 మొక్కజొన్న అధిక ఒలిపిడి శాతం కలిగి ఉంటుందని, కండి చివరి వరకు గింజలు మరియు సమానమైన కండెలు ఉంటాయని, బరువైన గింజలతో అధిక దిగుబడి ఇస్తుందన్నారు. వైరస్ తెగుళ్లను, నీటి ఎద్దడిని సమర్థవంతంగా తట్టుకుంటుందని రైతులు తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు, డీలర్స్ మరియు శ్రీరామ సీడ్స్ ప్రతినిధులు కె శేషు, ఎస్ నాగేశ్వరరావు, ఎం ఉమేష్, పి రవివర్మ, తదితరులు పాల్గొన్నారు.


